యాప్నగరం

హల్వా తిని ఐదుగురు దుర్మరణం..

హల్వా తిని అయిదుగురు దుర్మరణం పాలైన ఘటన రాజస్థాన్‌లోని భుటేలాలో చోటు చేసుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

TNN 10 Feb 2018, 3:21 pm
హల్వా తిని అయిదుగురు దుర్మరణం పాలైన ఘటన రాజస్థాన్‌లోని భుటేలాలో చోటు చేసుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లా భుటేలాకు చెందిన ఓ ఇంటికి అతిథులు వచ్చారు. గెస్టుల కోసం ఆ కుటుంబీకులు ప్రత్యేకంగా హల్వా చేసి వడ్డించారు. అయితే హల్వా తిన్న తర్వాత వారందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కొంత మంది మరణించారు. పరిస్థితి విషమించిన మరికొంత మందిని భిల్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu 5 dead 3 critical after eating halwa in rajasthans bhutela
హల్వా తిని ఐదుగురు దుర్మరణం..


ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కావాలనే ఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలోనూ పోలీసులు కేసు విచారిస్తున్నారు. ఘటనలో మొత్తం అయిదుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో అయిదేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.