యాప్నగరం

వరదలో కొట్టుకుపోయిన ఇళ్లు.. సామన్లు సర్దే సమయం కూడా లేదు

భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దార్చులా ప్రాంతంలో గోరీ నది ప్రవాహంలో 5 ఇళ్లు కొట్టుకుపోయాయి.

Samayam Telugu 20 Jul 2020, 5:50 pm
త్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, అసోం రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. గోరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Samayam Telugu ఉత్తరాఖండ్ వీడియో
Uttarakhand rain video


ఉత్తరాఖండ్‌లోని దార్చులా పరిధిలోని మున్సారీ ప్రాంతంలో గోరి నది ప్రవాహంలో 5 ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు నదీ ప్రవాహం సాధారణ స్థాయి కంటే ఊహించనంత ఎక్కువగా ప్రవహించడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (జులై 19) అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉండగా.. నదీ ప్రవాహం అనూహ్యంగా పెరిగిందని బాధితులు తెలిపారు. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో వెంటనే స్థానికులందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిపారు. దీంతో అందరూ సురక్షిత ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. అయితే.. ఇళ్లలోంచి సామన్లు, డబ్బులు తదితర విలువైన వస్తువులు తీసుకురావడానికి సమయం చిక్కలేదని, చూస్తుండగానే వరద ప్రవాహంలో ఇళ్లు కొట్టుకుపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరో 30 ఇళ్లు కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పితోర్‌గఢ్ డీఎం వీకే జోగ్దాండే తెలిపారు. బాధిత కుటుంబాలకు చెందిన వారినందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: కోట్ల కంపెనీకి కుమార్తెను రాణిని చేసిన తండ్రి

Don't Miss: పాన్ మసాలా కోసం పారిపోయిన కరోనా రోగి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.