యాప్నగరం

బార్‌లో ప్రమాదం... ఐదుగురు సజీవదహనం!

ఓ బార్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన బెంగళూరులోని కైలాశ్‌పాల్య మార్కెట్‌లో చోటుచేసుకుంది.

TNN 8 Jan 2018, 9:01 am
ఓ బార్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన బెంగళూరులోని కైలాశ్‌పాల్య మార్కెట్‌లో చోటుచేసుకుంది. కుంబార సంఘ భవనం కింది అంతస్తులోని కైలాశ్ బార్‌లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన ఐదుగురు వ్యక్తులు బార్‌లో పనిచేసే వారిగా గుర్తించారు. తమ విధులు ముగిసిన తర్వాత బార్‌లో నిద్రపోతున్న వీళ్లంతా సజీవదహనమయ్యారు.
Samayam Telugu 5 sleeping employees killed as fire razes bar in bengaluru
బార్‌లో ప్రమాదం... ఐదుగురు సజీవదహనం!


ప్రమాదం జరిగిన ప్రాంతం బెంగళూరు నగరానికి గుండెకాయ లాంటిది. నిరంతరం ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. మృతుల్లో ముగ్గురు తుముకూరుకు చెందిన స్వామి (23), ప్రసాద్ (20), మహేశ్ (35)లుగానూ, హసన్‌కు చెందిన మంజునాథ్ (45), మండ్యాకు చెందిన కీర్తి (24)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదని, దీనిపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల కిందట ముంబయిలోని కమలమిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ముంబై మరోల్ ఏరియాలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.