యాప్నగరం

ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం: నలుగురు మృతి

ముంబైలోని వందేళ్ల నాటి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.

TNN 31 Aug 2017, 11:40 am
ముంబైలోని వందేళ్ల నాటి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని జేజే హాస్పిటల్ సెంటర్ పక్మోడియా వీధిలోని భిండీ బజార్‌లో వందేళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, మున్సిపల్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీయగా, గాయపడిన 13 మందిని బయటకు తీశారు.
Samayam Telugu 5 storey bldg collapses in mumbai 4 dead
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం: నలుగురు మృతి


వీరిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గుర్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 30 మందిని సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు.దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు ముంబైలో వర్ణుడు శాంతించాడు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. బస్సులు, లోకల్ రైళ్లతోపాటు ఇతర రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.