యాప్నగరం

కశ్మీర్‌లో కాల్పుల హోరు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

నిఘావర్గాల హెచ్చరికల మేరకు కశ్మీర్‌లో సోదాలు జరుపుతున్న సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం.

Samayam Telugu 15 Sep 2018, 1:35 pm
మ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతాబలగాల మధ్య శనివారం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చౌగాం ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో బారాముల్లా - ఖాజీగండ్‌ మధ్య రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.
Samayam Telugu Untitled12


శ్రీనగర్‌కు 72 కిమీల దూరంలో ఉన్న చౌగాంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అందించిన నిఘావర్గాల సమాచారం మేరకు సైన్యం సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం నిర్వహించిన సోదాల్లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరిని హతమార్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.