యాప్నగరం

ముంబై చేరుకున్న ఈజిప్టు భారీ మహిళ

ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా చెప్పుకుంటున్న ఈజిప్టుకు చెందిన ఎమాన్ అహ్మద్ చికిత్స నిమిత్తం శనివారం ముంబైకి చేరుకున్నారు.

TNN 11 Feb 2017, 2:17 pm
ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా చెప్పుకుంటున్న ఈజిప్టుకు చెందిన ఎమాన్ అహ్మద్ చికిత్స నిమిత్తం శనివారం ముంబైకి చేరుకున్నారు. 36 ఏళ్ల వయసు గల ఈమె బరువు 500 కేజీలు. సుమారు 25 ఏళ్లుగా ఇంటి గుమ్మం దాటని ఎమాన్... ఆరోగ్య భద్రత కోసం బరువు తగ్గడానికి ముంబై వచ్చారు. నెల రోజుల పాటు ఆమెను పరిశీలించనున్న డాక్టర్లు తరవాత శస్త్రచికిత్స చేస్తారు.
Samayam Telugu 500 kg egyptian woman reaches mumbai for weight loss treatment
ముంబై చేరుకున్న ఈజిప్టు భారీ మహిళ


ప్రస్తుతం ఎమాన్ బారియాట్రిక్ సర్జన్ ముఫజల్ లక్డవాల్ సంరక్షణలో ఉన్నారు. గత మూడు నెలలుగా ఎమాన్ కేస్‌ను డీల్ చేస్తున్న ముఫజల్.. శస్త్రచికిత్స చేయకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదమని గతంలో చెప్పారు. ఈ మేరకు ఆమెను భారత్‌కు తీసుకురావడానికి వీసా ఇప్పించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను ముఫజల్ కోరారు. దీనికి సుష్మా వెంటనే స్పందించడంతో ఈజిప్టులోని అలెంగ్జాండ్రియా నగరానికి చెందిన ఎమాన్ ముంబై చేరుకున్నారు.

ఈజిప్ట్‌ఎయిర్ విమానంలో శనివారం ఉదయం 4 గంటలకు ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎమాన్‌ను ఓ ప్రత్యేక వాహనంలో సైఫీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమె వెంట అంబులెన్స్, పోలీస్ వాహనం ఆసుపత్రి వరకు వెళ్లాయి. ఆసుపత్రిలో ఎమాన్ కోసం ఓ ప్రత్యేక గదిని ఏర్పాటుచేసారు. అక్కడే ఆమె చికిత్స పొందనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.