యాప్నగరం

బ్యాంక్ దోపిడీ.. క్యాషియర్‌ను కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీలో పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. అడ్డొచ్చిన క్యాషియర్‌ను కాల్చి చంపిన దుండగులు, వైరల్‌గా మారిన సీసీటీవీ ఫూటేజ్.

Samayam Telugu 13 Oct 2018, 5:07 pm
దేశ రాజధాని నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన మరవకు ముందే.. శుక్రవారం పట్టపగలు గుర్తుతెలియని దుండగులు బ్యాంకులోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. వారికి ఎదురుతిరిగిన క్యాషియర్‌పై విచక్షణరహితంగా కాల్పలు జరిపారు. అనంతరం రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
Samayam Telugu Untitled123


ఈ ఘటన ఢిల్లీలోని చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పోరేషన్‌ బ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆరుగురు దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన దుండగలు ముందుగా సెక్యూరిటీ గార్డుపై దాడిచేసి, అతడి నుంచి గన్‌లాక్కున్నారు. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన ఓ వృద్ధ కస్టమర్‌ను సైతం కొట్టారు. అనంతరం క్యాషియర్ సంతోష్ కుమార్(45)ను డబ్బు మొత్తం ఇవ్వాలని బెదిరించారు. సంతోష్ ఎదురు తిరగడంతో కాల్చి చంపారు. బుల్లెట్‌ చాతి నుంచి దూసుకెళ్లడంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.