యాప్నగరం

సిలిండర్ పేలి ఆరుగురి దుర్మరణం

బెంగళూరులోని ఎజిపురా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పక్కపక్కనే ఉన్న నాలుగు ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సిలిండర్ పేలిన కారణంగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

TNN 16 Oct 2017, 12:04 pm
బెంగళూరులోని ఎజిపురా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పక్కపక్కనే ఉన్న నాలుగు ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సిలిండర్ పేలిన కారణంగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో.. కళావతి (69), రవి చంద్ర (48), హరి ప్రసాద్ (19), పవన్ కళ్యాణ్ (18), బిజూ (16)తో పాటు అశ్విని అనే గర్భిణి ఉన్నారు. శిథిలాల్లో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Samayam Telugu 6 dies in buildings collapsed incident in bangaluru
సిలిండర్ పేలి ఆరుగురి దుర్మరణం


మూడేళ్ల సంజన అనే బాలికను, అయిదేళ్ల మరో బాలుణ్ని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు. అధికారులు వీరిని ప్రాణాలతో బయటకు తీసుకురాగానే స్థానికులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలను ధ్రువీకరించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.