యాప్నగరం

రాజ్యసభలో పెగాసస్‌పై రగడ... ఆరుగురు టీఎంసీ ఎంపీలపై వేటు

ఆరుగురు టీఎంసీ ఎంపీలు బుధవారం రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. పెగాసస్ స్పైవేర్‌పై బుధవారం ఉదయం వీరు సభలో రభస సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ ఓ ప్రకటనలో తెలిపింది.

Samayam Telugu 4 Aug 2021, 3:41 pm
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రాజ్యసభలో షాక్‌ తగిలింది. పెగాసస్ వ్యవహారంపై చర్చించాలని పట్టుబడుతూ సభలో ఆందోళన చేపట్టిన ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. పెగాసస్ స్పైవేర్‌పై బుధవారం ఉదయం వీరు సభలో రభస సృష్టించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ వర్గాలు స్పష్టం చేశాయి. బుధవారం జరిగే మిగతా కార్యకలాపాలకు సభలో పాల్గొనరాదని వీరిని ఆదేశించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu Image


డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛేత్రి, అర్పిత ఘోష్, మౌసమ్ నూర్‌లను బుధవారం జరిగే మిగతా సభా కార్యకలాపాల్లో పాల్గొనరాదని రాజ్యసభ అధికారులు ఆదేశించారు. సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో వీరు వెల్‌లోకి ప్రవేశించారని, ప్లకార్డులు చూపుతూ, అధ్యక్ష స్థానం పట్ల అమర్యాదగా ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ సభలో ఆరుగురి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో రూల్ 255 ప్రకారం తక్షణమే సభ నుంచి వెళ్లిపోవాలని చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.