యాప్నగరం

ఆ డిపాజిట్లపై పన్ను పోటు తప్పదు: ప్రభుత్వం

వ్యక్తులు, సంస్థలు కలిపి 60 లక్షల మంది డిపాజిట్ చేసిన మొత్తం పాత నోట్ల విలువ రూ.7 లక్షల కోట్ల పైమాటేనని..

TNN 30 Dec 2016, 3:36 am
వ్యక్తులు, సంస్థలు కలిపి 60 లక్షల మంది డిపాజిట్ చేసిన మొత్తం పాత నోట్ల విలువ రూ.7 లక్షల కోట్ల పైమాటేనని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు డిపాజిట్ అయిన మొత్తం కరెన్సీపై గురువారం మీడియాతో మాట్లాడిన అధికారులు... జనం తమ వద్ద వున్న నల్ల ధనాన్ని తిరిగి బ్యాంకుల్లో జమ చేసినంత మాత్రాన్నే అది తెల్లధనం అయిపోదు అని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి సంపాదించిన ప్రతీ పైసాపై ఇక పన్ను తప్పదు అని పన్ను ఎగవేతదారులని హెచ్చరించారు.
Samayam Telugu 60 lakh individuals and companies under scrutiny
ఆ డిపాజిట్లపై పన్ను పోటు తప్పదు: ప్రభుత్వం


సక్రమమైన డిపాజిట్‌దారులని ప్రభుత్వం ఏమీ వేధించదు. అయితే, అదే సమయంలో పన్ను ఎగ్గొట్టి వెనకేసిన బ్లాక్ మనీ కలిగి వున్న వారిని కూడా అస్సలే విడిచిపెట్టదు అని కేంద్రం పేర్కొంది. అప్రకటిత ఆదాయం కలిగినవారికోసం నోట్ల రద్దు ప్రకటన అనంతరం సైతం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకు ఓ అవకాశం ఇచ్చాం. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోనివారిపై కూడా ప్రభుత్వం కొరడా ఝులిపిస్తుంది అని అధికారులు తెలిపారు.

తమ వద్ద వున్న నల్లధనాన్ని బ్యాంకుల్లో జమ చేయడంతోనే అది సక్రమమైపోయిందని జనం భావిస్తున్నారు. కానీ అలాంటి పప్పులేమీ ఉడకవు! రూ.2 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ అయిన ఎకౌంట్లు, అందులో ఎంత మొత్తం డిపాజిట్ అయిందనే వివరాలు ఏరోజుకు ఆరోజు మాకు అందుతూనే వున్నాయి అనే విషయాన్ని జనం మర్చిపోకూడదు అని ప్రభుత్వం స్పష్టంచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.