యాప్నగరం

UP ఎన్నికలు: పోలింగ్ 64%, రూ.34 కోట్లు జప్తు!

యూపీ తొలి దశ ఎన్నికల్లో భారీ సంఖ్యలో నగదు, మద్యం, బంగారం, వెండి వస్తువులు పట్టబడ్డాయి. వివిధ ఘటనల్లో దాదాపు పదివేల మందికి పైగా అరెస్టయ్యారు. కొన్ని పార్టీలు మద్యం, నగదుతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాయి. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

TNN 11 Feb 2017, 8:26 pm
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ తొలి దశ ఎన్నికలు శనివారం సాయంత్రానికి ముగిశాయి. మొత్తం 403 సీట్లకు గాను.. 73 సీట్లకు పోలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 64.22 శాతం పోలింగ్ జరిగింది. 2012లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 61 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు సందర్భంగా ఇక్కడ చెదురుమదురు ఘటనలు నమోదయ్యాయి. ఎన్నికల సంఘం అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu 63 voter turnout tentative in first phase of uttar pradesh elections
UP ఎన్నికలు: పోలింగ్ 64%, రూ.34 కోట్లు జప్తు!


రూ.19.56 కోట్ల నగదు, 4.44 లీటర్ల మద్యం, రూ.14 కోట్లు విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 13 పెయిడ్ న్యూస్ ఫిర్యాదులు ఈసీకి అందాయి.
3,888 డిజిటల్, వీడియో కెమేరాలతో ఎన్నికలపై నిఘా ఉంచారు. 2,857 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు.
యూపీలో మొత్తం 2.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.17 కోట్ల మంది మహిళలు, 1,508 ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
మొత్తం 839 అభ్యర్థులు బరిలో నిలిచారు.
• 403 నియోజకవర్గాలకు గాను మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.