యాప్నగరం

Pilots: ప్రయాణికులు బెదిరిపోయే న్యూస్.. ఫ్లైట్‌ను గాలికొదిలి పైలట్లు నిద్ర పోతున్నారంట..!

భారతీయ పైలట్లపై (Pilots) ఓ ఎన్‌జీవో సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. విమానం మధ్యలో నిద్రపోతున్నట్టు స్వయంగా పైలట్లే చెప్పారు. 5 వందలకుపైగా పైలట్లను ప్రశ్నించగా.. వారిలో 66 శాతం మంది ప్రయాణంలో కునుకుపాట్లు తప్పడం లేదని చెప్పుకొచ్చారు. విశ్రాంతి లేకపోవడం, సెలవులు లేకపోవడమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న నిబంధనలు మార్చాలని చాలామంది అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. విశ్రాంతి, సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 26 Sep 2022, 5:13 pm

ప్రధానాంశాలు:

  • 542 మంది పైలట్‌లపై సర్వే
  • నిద్రపోతున్నట్టు చెప్పిన 66 శాతం మంది
  • విశ్రాంతి లేకపోవడమే కారణమన్న పైలట్లు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Indian Pilots
విమానాలు నడిపే పైలట్లు (Pilots) గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా 542 మంది భారతీయ పైలట్‌లపై ఇటీవల సర్వే చేయగా.. అందులో ఎక్కువ మంది విమానంలో నిద్రపోతునట్టు అంగీకరించారు. అంతేకాదు పైలట్లు ఎక్కువగా అలసిపోతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడున్న నిబంధనలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పూర్తిగా రద్దు చేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు.
గురుగ్రామ్‌కు చెందిన NGO సంస్థ సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్ పగటిపూట నిద్రపోవడంపై సర్వే నిర్వహించింది. అందులో భాగంగా భారతీయ పైలట్‌లపై కూడా సర్వే చేసింది. ఈ మేరకు భారతీయ పైలట్‌లలో 66 శాతం మంది తమకు తెలియకుండా కాక్‌పిట్‌లో నిద్రపోయారని, దీనికి మిగతా సిబ్బంది అంగీకారంతోనే వారు నిద్రపోతున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. పైలట్లు చెప్పినదాని బట్టి పైలట్‌లలో 54 శాతం మంది పగటిపూట నిద్రలేమితో బాధపడుతున్నారని, 41 శాతం మంది మితమైన పగటి నిద్రతో బాధపడుతున్నారని అని తెలిసింది.

సర్వేలో 74 శాతం మంది పైలట్‌లు ఉదయమే బయలుదేరడమే అలసటకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. వరసగా ఫ్లైట్లు.. వారానికోసారి సెలవు లేకుండా 168 గంటల పాటు ప్రయాణించడం కారణమని చెప్పారు. అంతేకాదు ఒక రోజు పగలు, ఒక రోజు రాత్రిపూట ఫ్లైట్లు కారణంగా విశ్రాంతి ఉండడం లేదని, నిద్రకు భంగం కలుగుతుందన్నారు. అయితే ఇప్పుడున్న నిబంధనలే దానికి కారణమంటున్నారు. అందుకే దాదాపు 98 శాతం మంది పౌర విమానయాన నియంత్రణ సంస్థ సిబ్బంది సమస్యలను, పరిష్కరించేందుకు ఏమి చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా కొత్త మార్గ దర్శకాలను రూపొందించడంలో పైలట్లు, వారి ప్రాతినిథ్య సంస్థల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. ప్రస్తుతం నిబంధనలను తొలగించాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ DGCAని కోరింది. ఈ మేరకు సెప్టెంబర్ 12న ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (IPCA) ఒక లేఖ అందించింది. అందులో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌ ప్రకటించిన అన్ని నిబంధనలను ఉల్లంఘించినందున విమాన సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, విరామం లేకుండా పనిచేస్తున్నారని, ప్రస్తుత నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

అయితే పైలట్ల నిద్రావస్థల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 2010లో మంగళూరులో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్‌కి పైలట్ నిద్రపోవడం ఒక కారణంగా తేలింది. ఆ ప్రమాదంలో 158 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. పైలట్ నిద్రపోవడం వల్ల విమానం కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయిన సంఘటన కూడా గతంలో చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.