యాప్నగరం

టెర్రరిస్ట్ ఎటాక్: ఏడుగురు అమర్‌నాథ్ యాత్రికుల మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు.

TNN 10 Jul 2017, 10:46 pm
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బాటెంగూ, ఖనబల్ ప్రాంతం సమీపంలో పోలీసు పెట్రోలింగ్ పార్టీపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఏడుగురు అమర్‌నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. భారీ మొత్తంలో ఆయుధ సామగ్రిని వెంటతెచ్చుకున్న టెర్రరిస్టులు శ్రీనగర్‌-జమ్మూ హైవే మీద వెళ్తున్న పెట్రోలింగ్ పార్టీ లక్ష్యంగా కాల్పులు జరిపారు.
Samayam Telugu 7 amarnath pilgrims killed in terror attack in jammu and kashmir
టెర్రరిస్ట్ ఎటాక్: ఏడుగురు అమర్‌నాథ్ యాత్రికుల మృతి


అయితే, అదే సమయంలో అదే హైవేపై ప్రయాణిస్తున్న ఓ బస్సులో వున్న అమర్‌నాథ్ యాత్రికులకి టెర్రరిస్టుల బుల్లెట్లు తగలడంతో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు అని కశ్మీర్‌ ఐజీపీ మునీర్ ఖాన్ మీడియాకు తెలిపారు. టెర్రరిస్టుల దాడిలో గాయపడిన క్షతగాత్రులను అనంత్‌నాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. 40, 90వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కి చెందిన సైనిక బలగాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.