యాప్నగరం

నక్సల్స్ దాడి.. ఏడుగురు పోలీసులు దుర్మరణం

చత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో నక్సల్స్ పంజా విసిరారు. ఆదివారం భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని లక్ష్యం చేసుకుని నక్సల్స్ దాడిచేశారు.

Samayam Telugu 20 May 2018, 7:33 pm
త్తీస్‌గడ్‌లోని దంతేవాడలో నక్సల్స్ పంజా విసిరారు. ఆదివారం భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని లక్ష్యం చేసుకుని నక్సల్స్ దాడిచేశారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు ఖోల్నార్ నుంచి కిరండోల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Samayam Telugu 20aaaaaaa


దంతేవాడ రేంజ్ డీఐజీ రతన్ లాల్ చెప్పిన వివరాల ప్రకారం.. కిరండోల్ - పల్నార్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న రోడ్డు కోసం మెటీరియల్ తీసుకెళ్తున్న వాహనానికి ఎస్కార్ట్‌గా పోలీసులు బొలెరో వాహనంలో బయల్దేరారు. ఈ సమాచారం అందుకున్న నక్సల్స్ మార్గ మధ్యలో మందుపాతర పాతి.. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేల్చేశారు. అనంతరం విగతజీవులుగా పడివున్న పోలీసుల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు.

బాంబుదాటికి బొలేరో వాహనం గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న కాలవలోకి పడింది. ఘటనా స్థలి వద్ద పోలీసుల మృతదేమాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నక్సల్స్ కోలం గాలింపులు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.