యాప్నగరం

చికు చికు బండి, అందరికీ అందేనండి!

దూర ప్రయాణం చేయాలంటే ఎందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు? ఈ ప్రశ్నకు చాలామంది చెప్పే సమాధానం ‘రైలు’. ఔను మరి, ఇందులో ఉన్న సౌలభ్యం మరెందులోనూ ఉండదు. అయితే...

TNN 4 Apr 2017, 5:13 pm
దూర ప్రయాణం చేయాలంటే ఎందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు? ఈ ప్రశ్నకు చాలామంది చెప్పే సమాధానం ‘రైలు’. ఔను మరి, ఇందులో ఉన్న సౌలభ్యం మరెందులోనూ ఉండదు. అయితే, 2012 నుంచి రైళ్లకు ఆధరణ తగ్గడం ఆశ్చర్యం కలిగించినా, అది వాస్తవం. సంతోషించతగిన విషయం ఏమిటంటే.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో మునుపెన్నడూ లేనంతగా ప్రయాణికులు పెరిగారు.
Samayam Telugu 70 million more passengers travel in trains in 2016 17
చికు చికు బండి, అందరికీ అందేనండి!


తేడాది సుమారు 70 మిలియన్ మంది రైళ్లలో ప్రయాణించారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ఇంత పెరుగుదల చూడలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. తాము చేపట్టిన సంస్కరణల వల్లే ఈ స్థాయిలో పెరుగుదల కనిపించదని అధికారులు తెలుపుతున్నారు. గతేడాది సుమారు 87 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు 586 అదనపు కోచ్‌లతో 43, 420 బెర్తులను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల పెరుగుదల వల్ల రైల్వేకు రూ.1,906 కోట్లు లభించడం గమనార్హం. భవిష్యత్తులో కొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చి రైలు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.