యాప్నగరం

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి అలజడి రేగింది. బీజాపూర్‌ ప్రాంతం తుపాకీల మోతతో దద్దరిల్లింది. ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు.

Samayam Telugu 19 Jul 2018, 1:52 pm
ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి అలజడి రేగింది. బీజాపూర్‌ ప్రాంతం తుపాకీల మోతతో దద్దరిల్లింది. ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. స్పాట్‌లో 15 తుపాకీలతో మరికొన్ని ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఇరువురి మధ్య హోరా హోరీగా ఎదురు కాల్పులు జరిగాయి.
Samayam Telugu Encounter


కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు మావోయిస్టులు గాయాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం కూడా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బీజాపూర్‌తో పాటూ చుట్టు పక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.