యాప్నగరం

తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కల్లోలం.. 84 మందికి పాజిటివ్

దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ముంబయి తర్వాత చెన్నైలోనే కోవిడ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు.

Samayam Telugu 23 Jul 2020, 3:32 pm
ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాల గవర్నర్ నివాసంలోని ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా, తమిళనాడు గవర్నర్ నివాసంలోని 84 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో భద్రత, అగ్నిమాపక సిబ్బంది సహా పలువురు ఉన్నట్టు తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీరిలో ఎవరూ గవర్నర్‌తో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో లేరని తెలిపింది. అధికారుల ప్రకటన ప్రకారం.. వీరంతా రాజ్‌భవన్ మెయిన్ గేట్ పరిసరాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారే.
Samayam Telugu తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా
Tamil Nadu Raj bhavan


పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఎవరూ గవర్నర్‌తోనూ లేదా ఉన్నతాధికారులతోనూ కాంటాక్ట్ కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌ సిబ్బందిలో కొందరికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో భద్రత, ఫైర్ సిబ్బంది సహా మొత్తం 147 మందికి నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 84 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

వైరస్ బారినపడ్డ 84 మందిని క్వారంటైన్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ఆరోగ్య సిబ్బంది శానిటైజేషన్ నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో 1.86 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 3,144 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే కరోనా కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అయితే, ఈ రాష్ట్రంలో బాధితులు పెద్ద సంఖ్యలో కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1.31 లక్షల మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.