యాప్నగరం

నిధులన్నీ మరదలికే మరలించిన మాజీ సీఎం

గోశాలల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 86 శాతం తన మరదలి పేరుతో నడుపుతున్న స్వచ్ఛంద సంస్థకే కేటాయించారు మాజీ సీఎం. ఇది సమాచార హక్కు ద్వారా వెలుగుచూసింది.

TNN 3 Jul 2017, 6:28 pm
అఖిలేశ్‌ యాదవ్‌ హయాంలో గో సేవా ఆయోగ్‌ పేరుతో గోశాలల సంక్షేమానికి 2012 నుంచి 2017 వరకు రూ. 9.66కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే అందులో 86శాతం అంటే రూ. 8.35 కోట్లు ఒకే ఒక్క గోశాలకు కేటాయించారు. అది కూడా అఖిలేశ్‌ మరదలు అపర్ణయాదవ్‌ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన గోశాల కావడం గమనార్హం. సమాచార హక్కు చట్టం కింద నూతన్ ఠాకూర్ అనే ఓ మహిళ అడిగిన వివరాలతో ఇవి వెలుగులోకి వచ్చాయి. అఖిలేశ్‌ సోదరుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య అపర్ణ యాదవ్‌ జీవ్ ఆశ్రయ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలో భాగంగా లక్కోలోని అమౌసీ ప్రాంతంలో గోశాలను ఏర్పాటుచేసిన అపర్ణ ఆవుల సంరక్షణ చేపట్టింది. అఖిలేశ్‌ యాదవ్‌ సీఎంగా ఉన్న సమయంలో ఈ గోశాలకు రూ.8.35 కోట్ల విరాళాలు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2012-13లో రూ.49.89 లక్షలు, 2013-14లో రూ.1.25 కోట్లు, 2014-15లో రూ.1.41 కోట్లు మంజూరు చేస్తే, ఇక 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ. రూ. 5.13 కోట్లు కేటాయించడం గమనార్హం.
Samayam Telugu 86 4 of up gaushala grant went to ngo run by akhileshs sister in law
నిధులన్నీ మరదలికే మరలించిన మాజీ సీఎం


ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గోశాలలకు నిధులు విడుదల చేశారు. ఇప్పటివరకు రూ. 1.05కోట్ల విడుదల చేస్తే జీవ్‌ ఆశ్రయకు మాత్రం ఎలాంటి నిధులివ్వలేదని పేర్కొన్నారు. అపర్ణయాదవ్‌ గోశాలపై పిటిషన్‌ వేసిన నూతన్‌ ఠాకూర్‌ ఎవరో కాదు ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌ భార్య. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమిత్ ఠాకూర్‌ వదాలు చోటుచేసుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.