యాప్నగరం

భోజనం చేస్తూ.. 9 మంది మృతి

భోజనానికి ముందు అంతా కలసి మద్యం తాగారు. భోజనం చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు.

TNN 11 Jan 2018, 9:45 pm
భోజనం తింటూనే ఒకరు తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. అలా ఒకేసారి తొమ్మిది మంది ఒకేసారి మరణించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. దాల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన 9 మంది కుటుంబికులు మంగళవారం రాత్రి బరాబంకీలోని వారి బంధువుల ఇంటికి విందు భోజనానికి వెళ్లారు.
Samayam Telugu 9 dead after consuming food drinks at relatives place
భోజనం చేస్తూ.. 9 మంది మృతి


భోజనానికి ముందు అంతా కలసి మద్యం తాగారు. భోజనం చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఒకరు గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. మిగతా ఎనిమిది మంది రిపోర్టులు రావల్సి ఉంది. అయితే, కలుషిత ఆహారం తినడం వల్ల వాళ్లు మరణించారా? లేదా కల్తీ మద్యం తాగారా అనేది తేలాల్సి ఉంది.

భోజనానికి పిలిచిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడకుండా అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.