యాప్నగరం

కశ్మీరీల్లో మార్పు... 90 శాతం తగ్గిన రాళ్ల దాడులు!

కశ్మీరీల వైఖరిలో ఇంతలోనే ఎంత మార్పు... గతేడాది జులై 8 న బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

TNN 13 Nov 2017, 3:04 pm
కశ్మీర్ లోయలో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో రాళ్లు రువ్వే కార్యక్రమాలు 90 శాతం తగ్గాయని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఇది కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితికి అద్దంపడుతోందని, ఈ విజయం కశ్మీరీలకు దక్కుతుందని ఆయన అన్నారు. ఎన్ఐఏ దాడులు మాత్రమే కాకుండా, నోట్ల రద్దు, ఉగ్రవాద సంస్థలకు చెందిన కమాండోలను మట్టుబెట్టడం లాంటివి ఈ పరిస్థితికి దోహదపడ్డాయని వైద్ తెలిపారు. గతేడాది సైన్యం మీదకు రాళ్లు రువ్వే కార్యక్రమాలు సాధారణంగా రోజుకు 40 నుంచి 50 వరకు జరిగితే ప్రస్తుతం కేవలం అక్కడక్కడ మాత్రమే చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని వారాల నుంచి వీటిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu 90 dip in stone pelting incidents in kashmir in 2017 jk dgp
కశ్మీరీల్లో మార్పు... 90 శాతం తగ్గిన రాళ్ల దాడులు!


కశ్మీరీ ప్రజల్లో వచ్చిన మార్పులకు ఇదే నిదర్శనమని డీజీపీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తడం లేదని అన్నారు. శుక్రవారాల్లోనూ ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడం విశేషమని వైద్ సంతోషం వ్యక్తం చేశారు. దాడుల వల్ల తమ ఆస్తులకు, సమాజానికి నష్టం వాటిళ్లుతోందని కశ్మీరీలు గుర్తించారని ఆయన తెలియజేశారు. నోట్ల రద్దు, తీవ్రవాద సానుభూతిపరుల అరెస్టు లాంటి కారణాలు పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చాయని, అలాగే రాజకీయపరమైన చర్యలు కూడా ఇందుకు దోహదపడ్డాయని అన్నారు.

అలాగే అధికారులు, పోలీసులు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విజయం సాధించారని కొనియాడారు. పోలీసులు, ఆర్మీ, భద్రత సంస్థలు సమన్వయంతో పనిచేసి లోయలో పరిస్థితి అదుపులోకి తెచ్చాయని తెలిపారు. అలాగే తీవ్రవాదులపై పోరాటంలోనూ పెద్ద పెద్ద విజయాలు సాధించారని, ఇప్పటి వరకు 170 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు... గత పదేళ్లతో పోల్చుకుంటే ఇది రికార్డేనని ఆయన అన్నారు. లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాద సంస్థల కమాండోలు సైతం సైనిక ఆపరేషన్‌లో హతమైనట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.