యాప్నగరం

సైకిల్ కోసం పోరాటం: ఈసీని కలిసిన అఖిలేష్ వర్గం

యూపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూనే ఉన్నాయి.

TNN 3 Jan 2017, 3:05 pm
యూపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. తండ్రీ కొడుకుల మధ్య రాజకీయ సమరం కొనసాగుతూనే ఉంది. మెజార్జీ ఎమ్మెల్యేల సాయంతో అఖిలేష్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నిజమైన సమాజ్ వాదీ పార్టీ తమదేనని, సైకిల్ గుర్తు తమదేనని అఖిలేష్ వర్గం అంటుండగా, ములాయం సింగ్ సైకిల్ గుర్తు తన వర్గానికే చెందుతుందని వాదిస్తున్నారు. సోమవారం ములాయం ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్‌ను కలిసి సైకిల్ ను తమకే కేటాయించాలని కోరారు. మంగళవారం అఖిలేష్ వర్గం తరపున రామ్ గోపాల్ యాదవ్ ఈసీని కలిశారు. అధికారులతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu 90 of mlas support akhilesh yadav says ram gopal yadav
సైకిల్ కోసం పోరాటం: ఈసీని కలిసిన అఖిలేష్ వర్గం


రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ 90 శాతం ఎమ్మెల్యేలంతా అఖిలేష్ తోనే ఉన్నట్టు ఈసీకి విన్నవించామని చెప్పారు. కావున సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్‌దేనని, సైకిల్ గుర్తు అతనికే ఇవ్వాలని ఈసీ అధికారులను కోరినట్టు తెలిపారు.

ములాయం సింగ్ వర్గం మాట్లాడుతూ శనివారం అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ పై పార్టీ నుంచి సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ప్రకటించారని, అయితే రాత పూర్వకంగా ఇంకా వారికి ఏమీ పేపర్లు ఇవ్వలేదని అన్నారు. అంటే వారు టెక్నికల్ గా ఇంకా సస్పెన్షన్ లోనే ఉన్నట్టని అన్నారు. కనుక ఈసీ వారిని పరిగణించకపోవచ్చన్నది వారి అభిప్రాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.