యాప్నగరం

ఆధార్ కార్డులు పొందినవారు 99 శాతం!

దేశంలో 18 ఏళ్లు దాటిన 99 శాతం మంది ఆధార్ కార్డులు పొందినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

TNN 28 Jan 2017, 11:40 am
దేశంలో 18 ఏళ్లు దాటిన 99 శాతం మంది ఆధార్ కార్డులు పొందినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా 111 కోట్ల మంది ఆధార్ గుర్తింపు నంబర్‌ను పొందగా వారిలో 99 శాతం మంది 18 సంవత్సరాల వయసు దాటినవారు ఉన్నారట. భారత్‌ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థ కారణంగానే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Samayam Telugu 99 of indians over 18 now have aadhaar cards
ఆధార్ కార్డులు పొందినవారు 99 శాతం!


మరోవైపు ప్రజా సంక్షేమ పథకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆధార్ చట్టం కూడా గుర్తింపు కార్డుల సంఖ్య పెరగడానికి ఉపయోగపడింది. ప్రభుత్వ పథకాలను పొందే లబ్ధిదారుల విషయంలో డూప్లికేషన్ జరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. అయితే ప్రభుత్వ పథకాల్లో ఆధార్‌ను తీసుకురావడం వల్ల గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం రూ.36వేల కోట్లను ఆదా చేయగలిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎల్పీజీ, ఉపాధి హామీ పథకం మొదలైన ప్రభుత్వ పథకాల్లో ఆధార్ తప్పనిసరి చేయడంతో ప్రభుత్వానికి ఇంత మొత్తాన్ని ఆదా చేయగలిగింది.

ఆధార్ ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ అదొక గుర్తింపు కార్డుగానే మిగిలిందని, అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక, భవిష్యత్తు కార్యచరణలకు ఆధార్ ఒక ఆయుధంగా మారిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. డిజిటల్ విభజనను ఒక తాటిపైకి తెచ్చేందుకు ఆధార్ శక్తి వంతమైన ఆయుధమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తరవాత ఆధార్ జనరేషన్, ఆర్థిక కార్యకలాపాల్లో ఆధార్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 2014 నుంచి మే 2014 మధ్య రోజుకి 3 నుంచి 4 లక్షల మంది ఆధార్‌ను ఎన్‌రోల్ చేసుకున్నారని అధికారులు చెప్పారు. అయితే అక్టోబర్ 2016 నాటికి ఈ సంఖ్య 5 నుంచి 6 లక్షలకు పెరిగిందని తెలిపారు. డీమానిటైజేషన్ తర్వాత ఒకరోజులో ఆధార్ ఎన్‌రోల్ చేసుకునేవారి సంఖ్య 7 నుంచి 8 లక్షలకు పెరిగిందని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.