యాప్నగరం

నొయిడా: కరోనాను జయించిన 94 ఏళ్ల వృద్ధుడు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి

కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వయసు మళ్లినవారిపై ప్రభావం చూపుతుండగా.. యూపీలో 94 ఏళ్ల వృద్ధుడు వైరస్‌ను జయించి, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవడం విశేషం.

Samayam Telugu 9 Jun 2020, 9:39 am
ఉత్తరప్రదేశ్‌లో ఓ 94 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ మహమ్మారిని జయించాడు. అతడు వైరస్ నుంచి కోలుకుని కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపాడు. గౌతమ్‌బుద్దానగర్‌ జిల్లాకు చెందిన వృద్ధుడు కరోనా నుంచి కోలుకుని ఆదివారం కొవిడ్‌ చికిత్స కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆయనతో పాటు మరో 60 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయం గురించి జిల్లా పాలనాధికారి సుహాస్‌ లాలింకరే యతిరాజ్‌ ట్విట్టర్‌లో పేరొన్నారు.
Samayam Telugu ఉత్తరప్రదేశ్ కరోనా పేషెంట్
UP Coronavirus Survivor


‘శారదా ఆసుపత్రి నుంచి ఆదివారం 10 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.. వారిలో 94 వృద్ధుడు ఉండటం గమనార్హం.. ఆయన కరోనా నుంచి కోలుకుని దేశంలో 2.5 లక్షలకు పైగా ఉన్న కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపాడు’ అని అన్నారు. అలాగే అధికారులు మరింత కష్టపడి కరోనా పారదోలేందుకు తమకు సహకారం అందజేశారని అన్నారు. మరి కొన్నేళ్లు ఇలాగే ఆయన నవ్వుతూ జీవించాలి.. అంటూ ఆ వ్యక్తి ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఉత్తప్రదేశ్‌లో కరోనా బాధితుల రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

శారద హాస్పిటల్‌లో వృద్ధుడితోపాటు చికిత్స పొందిన మరో పది మందిని ఆదివారం డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ గౌతమబుద్ధానగర్ జిల్లాల్లో 699మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 470 మందికిపైగా కోలుకున్నారని, 195 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కాగా, యూపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,947కి చేరింది. వీరిలో 283 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,300 మందికిపైగా కోలుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.