యాప్నగరం

కేజ్రీవాల్‌కు షాక్: ఆప్ ఎమ్మెల్యే బీజేపీ తీర్థం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. వచ్చె నెలలో ఢిల్లీకి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న

TNN 27 Mar 2017, 5:18 pm
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. వచ్చె నెలలో ఢిల్లీకి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో...ఆప్ ఎమ్మెల్యే వేద ప్రకాష్ సతీష్ సోమవారం రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. కేజ్రీవాల్ వేద ప్రకాష్ కు నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
Samayam Telugu a blow to kejriwal aap mla ved prakash join bjp
కేజ్రీవాల్‌కు షాక్: ఆప్ ఎమ్మెల్యే బీజేపీ తీర్థం


‘‘ఆప్ లో కొనసాగడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. నాతోపాటు మరో 35 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగలేక అసంతృప్తితో ఉన్నారు’’ అని వేద ప్రకాష్ బీజేపీలో చేరిన అనంతరం వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలున్న డిల్లీ అసెంబ్లీలో 67 స్థానాలను ఆప్ గెలుచుకుంది. ఏప్రిల్ 23 ఢిల్లీలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.