యాప్నగరం

వయసు 106.. అయినా అలుపెరగని శ్రామికుడు

90 ఏళ్ల వయసు వరకు సైకిల్‌పై తిరిగే ఆ పెద్దాయన ప్రస్తుతం బస్సు సర్వీసును ఆశ్రయిస్తున్నారు. కానీ ఎవరిపై ఆధారపడటం తనకు ఇష్టం లేదన్నారు.

Samayam Telugu 22 Nov 2018, 10:44 pm
శతాధిక వృద్ధుడు నేటికి తన పని తానే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మద్ది సాబ్‌ అలియాస్‌ అహ్మద్‌ సాహెబ్‌. 106 ఏళ్ల వయసులోనూ కూతురు, కుమారుడు, ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. వందేళ్లు దాటినా వ్యాపారం చేసుకుంటున్నారు అహ్మద్‌ సాహెబ్‌. 90 ఏళ్ల వయసు వరకు సైకిల్‌పై తిరిగే ఆ పెద్దాయన ప్రస్తుతం బస్సు సర్వీసును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
Samayam Telugu Century man


పదేళ్ల వయసులో బెంగళూరుకు వచ్చానని, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని చెప్పారు. శివమొగ్గ జిల్లా హోసనగర్‌ తాలుకా నిత్తూర్‌ గ్రామానికి చెందిన అహ్మద్‌ సాహెబ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారి వద్ద ఉండాలని పిల్లలు ఎంతగా కోరినా.. తన కాళ్లమీద తానే జీవిస్తానని ఎవరి దయాదాక్షిణ్యాలు తనకు అవసరం లేదన్నారు. 50 ఏళ్ల కిందట సైకిల్‌ తనకు ఆప్త మిత్రుడు అయిందని.. తొంబై ఏళ్ల వరకు సైకిల్‌పై రోజూ మార్కెట్‌కెళ్లి చీరలు, మూలికలు అమ్ముకునేవాడినని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నానని, 100 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రయాణం ఉచితమని వెల్లడించారు.

‘1940లో గాంధీగారిని కలిశాను. స్వాతంత్ర ఉద్యమ ప్రచారంలో భాగంగా తలగుప్పకు వచ్చిన సందర్భంగా నాకు మహాత్ముడిని కలుసుకునే అవకాశం వచ్చింది. అది నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. కొన్నేళ్లు కాపరిగా పనిచేశాను. నెలకోసారి శివమొగ్గకు సైకిల్‌పై వెళ్లేవాడిని ప్రస్తుతం శరీరం అంతగా సహకరించడం లేదని’ ఆ పెద్దాయన గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఎవరిపై ఆధారపడకుండా ఆదర్శంగా జీవిస్తున్న సాహెబ్‌ను తెలిసినవారు గౌరవంగా పలకరిస్తుంటారు.
Read Article In Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.