యాప్నగరం

కూలిపోయిన ‘జాగ్వార్’

శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

TNN 3 Oct 2016, 6:17 pm
శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు నడుపుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ‘జాగ్వార్’ ప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు పైలెట్లు విమానం నుంచి పారాచూట్ సాయంతో కిందకి దూకేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ లో జరిగింది. జాగ్వార్ రోజులాగే కొత్త పైలట్ల శిక్షణ కోసం బయలుదేరింది. అనుకోకుండా భారత్-పాక్ సరిహద్దులో కూలిపోయింది. ఈ ఘటనను డిఫెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ ఓజా ధ్రువీకరించారు. ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.
Samayam Telugu a jaguar aircraft of indian air force on monday crashed in pokhran
కూలిపోయిన ‘జాగ్వార్’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.