యాప్నగరం

పప్పులు ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం స్పెషల్ టీమ్‌తో గాలింపు... 9 ఏళ్ల తర్వాత పట్టుకున్న పోలీసులు

పప్పులు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు ఏకంగా స్పెషల్ టీమ్ పెట్టి మరీ గాలించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్‌లలో తనిఖీలు చేశారు. 2011లో పప్పులు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లడంతో పోలీసులు అప్పటి నుంచి ఇప్పటి వరకూ దర్యాప్తు చేసి.. ఎట్టకేలకు సెప్టెంబర్ 26వ తేదీన తన గ్రామంలో పట్టుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా.. విస్తుపోయే నిజాలు చెప్పాడు. గొడౌన్‌ల నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను సగం ధరకే అమ్ముకునే వాడంట.

Authored byAndaluri Veni | Samayam Telugu 29 Sep 2022, 6:58 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో వింత దొంగతనం కేసు
  • 230 బస్తాలు పట్టుకుపోయిన దొంగ
  • 2011లో దొంగతనం చేసిన వ్యక్తి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bihar Man stole pulses
తొమ్మిదేళ్లు పరారీలో ఉన్నదొంగను ఢిల్లీ పోలసు బుధవారం అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ దొంగ సిరస్‌పూర్‌లోని గోడౌన్‌లో 230 బస్తాల పప్పులు, తృణ ధాన్యాలు దొంగతనం చేశాడంట. బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ (32) స్వతహాగా ఒక దొంగ. గతంలో 12 దొంగతనాల కేసులు సంతోష్ కుమార్‌పై ఉన్నాయి. ఇళ్లలో చొరబడి అందినవి అందిన కాడికి దోచుకుంటుంటాడు. సంతోష్ కుమార్‌ను గతంలో ఓ చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన వ్యక్తి.. మాయం అయిపోయాడు. అయితే అప్పుడప్పుడు ఢిల్లీకి వచ్చేవాడని.. పోలీసులకు తెలిసింది.
ఆ క్రమంలో నిందితుడు సంతోష్ కుమార్.. ఇంకొంతమందితో కలసి ఆగష్టు 18, 2011న ఒక గోడౌన్‌లోకి ప్రవేశించి.. పప్పులు, తృణ ధాన్యాలు, బియ్యం 230 బస్తాలను పట్టుకుని పారిపోయారు. ఆ టైంలో అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ను, కూలీలను బెదిరించినట్టు పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి సంతోష్ కుమార్ పోలీసులకు దొరకలేదు. సంతోష్‌ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లో పర్యటించింది. ఈ మేరకు పోలీసులు నిరంతరం సోదాలు, తనిఖీలు నిర్వహించేవారు.

అలా తొమ్మిదేళ్లు గడచిపోయింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 26న బీహార్‌లోని అతని స్వస్థలమైన బంకా గ్రామంలో సంతోష్ కుమార్ పట్టుబడ్డాడు. సంతోష్ కుమార్‌ను విచారించగా.. 2010లో ఆజాద్‌పూర్ మండిలో కూలీగా పని చేసుకుంటున్న సమయంలో గోడౌన్‌లలో వస్తువులను దొంగిలించి సగం రేటుకు విక్రయించే రాజేష్ పాశ్వాన్‌తో పరిచయం అయిందని, ఆ తర్వాత ఇద్దరూ కలసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. అలా దొంగతనం చేసి పప్పులు, తృణధాన్యాలు, బియ్యాన్ని కూడా సగం ధరకే అమ్ముకున్నట్టు తెలుస్తుంది. ఇలా దొంగతనాలు చేస్తూ నిందితుడు గత నాలుగు, ఐదేళ్లుగా ఢిల్లీ, పాట్నా, భాగల్‌పూర్, బీహార్‌లోని వారు బంధువుల ఇళ్లలో తల దాచుకునేవాడు. ఈ క్రమంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. సెప్టెంబర్‌ 26న అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

Read More: National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.