యాప్నగరం

మోదీకి గుండు గీయాలంటూ ఫత్వా జారీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మత గురువు ఫత్వా జారీ చేశారు.

TNN 8 Jan 2017, 12:27 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మత గురువు ఫత్వా జారీ చేశారు. మోదీ గడ్డం, తీసేసి గుండు గీసి...ఆయనపై నల్లరంగు చల్లిన వారికి రూ.25లక్షలు బహుమానంగా అందిస్తానని ఆయన ఫత్వాలో పేర్కొన్నారు.
Samayam Telugu a muslim cleric issues fatwa gains pm modi to cut off his beard
మోదీకి గుండు గీయాలంటూ ఫత్వా జారీ


కోల్ కత్తాలోని టిప్పూ సుల్తాన్ మసీదు కు చెందిన సయ్యద్ మహ్మాద్ నురూర్ రెహ్మన్ బర్కతీ అనే ఇమామ్ ఈ ఫత్వా జారీ చేశారు. నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో అశాంతి పెరిగిందని ఆయన ఆరోపించారు.

మోదీపై ఫత్వా జారీ చేసిన ఇమామ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడు.
దేశంలో మెజార్టీ ప్రజలు మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారని బర్కతీ అన్నారు.

మోదీ సాధువులు, ఇమాముల్లా గెడ్డాలు పెంచుకొని దేశప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘మోదీకి గెడ్డం గీసి..గుండు చేసి..ఆయనపై నల్ల రంగు పూసిన వాళ్లకు రూ.25లక్షల బహుమానం’ అంటూ బర్కతీ ఫత్వాలో పేర్కొన్నారు.

బర్కతీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ మండిపడుతోంది. తక్షణమే బర్కతీని అరెస్టు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని అవమాన పరిచిన ఇమామ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన మమతా ప్రభుత్వానికి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.