ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఆస్పత్రి ఆవరణలో ఓ నర్సు మృతదేహం వేలాడుతూ కనిపించింది. అయితే ఆ నర్స్ ముందు రోజే ఉద్యోగంలో జాయిన్ అయింది. దాంతో ఆ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగర్మౌ కొత్వాలీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆవరణలోనే అనుమానాస్పద రీతిలో గోడకు వేలాడుతూ నర్స్ మృతదేహం కనిపించింది. అది చూసిన వారు వెంటనే పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఘటన జరగడానికి ఒక్కరోజు ముందే అంటే శనివారం బాధితురాలి ఆస్పత్రిలో డ్యూటీలో చేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై నిందితులే మర్డర్ చేసి ఉంటారని ఆరోపించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
"న్యూ జీవన్ ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని పోస్ట్మార్టంకు పంపించాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఉన్నావ్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ తెలియజేశారు. కాగా నర్స్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు. కాగా నర్స్ మృతదేహం గోడకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు దిగారు.
"న్యూ జీవన్ ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని పోస్ట్మార్టంకు పంపించాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఉన్నావ్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ తెలియజేశారు. కాగా నర్స్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు. కాగా నర్స్ మృతదేహం గోడకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు దిగారు.