యాప్నగరం

ఆధార్ డేటా చోరీకి గురైతే పరిస్థితి ఏంటి ?

ఆధార్ డేటా చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని కొంతమందికి కలుగుతున్న సందేహాలని...

TNN 5 Mar 2017, 5:25 pm
ఆధార్ డేటా పూర్తి సురక్షితమని, ఆధార్ బయోమెట్రిక్స్ సమాచారం గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగం స్పష్టంచేసింది. "సబ్సీడీ బదీలలని ఆధార్‌కి లింక్ చేయడం ద్వారా గత రెండున్నరేళ్లలో 49,000 కోట్లు పొదుపు అయ్యాయి. గడిచిన ఐదున్నరేళ్లలో దాదాపు 400 కోట్లకుపైగా ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిగినప్పటికీ, ఎక్కడా ఆధార్ డేటా దుర్వినియోగం అయిన దాఖలాలు లేవు" అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. తమ వద్ద వున్న ఆధార్ సమాచారాన్ని ఇతరులు ఛేదించడం కానీ తస్కరించడం కానీ అసాధ్యం అని ఆధార్ సంబంధిత కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్న ఈ సంస్థ తెలిపింది.
Samayam Telugu aadhaar data base fully safe and secure uidai
ఆధార్ డేటా చోరీకి గురైతే పరిస్థితి ఏంటి ?


ఆధార్ డేటా దుర్వినియోగానికి గురైనట్టుగా ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తా కథనంపై స్పందిస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వివరణ ఇచ్చింది. ఆ వార్తా కథనంలో పేర్కొన్న ఘటనలో ఓ బ్యాంక్ సిబ్బంది అయిన నిందితుడే తన బయోమెట్రిక్స్‌ని తానే దుర్వినియోగపర్చుకోబోయాడని, అది గుర్తించిన ఆధార్ ఇంటర్నల్ సెక్యురిటీ సిస్టమ్ సంబంధిత విభాగాన్ని అప్రమత్తం చేయడం, ఆధార్ చట్టం కింద చర్యలు తీసుకోవడం జరిగిపోయిందని సంస్థ ఈ వివరణలో పేర్కొంది.

సుపరిపాలనకి, ప్రజా సాధికారతకి ఈ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుంది అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పునరుద్ఘాటించింది. ఆధార్ డేటా చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని కొంతమందికి కలుగుతున్న సందేహాలని నివృత్తి చేయడానికే ఆ సంస్థ ఈ వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.