దేశంలోని 100 కోట్ల మంది ఆధార్ సమాచారం లీక్ అయ్యిందని, రూ.500 ఇస్తే వివరాలు వచ్చేస్తాయని ది ట్రైబ్యూన్ పత్రిక సంచనల కథనం వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై యూఐడీఏఐ ఫిర్యాదు మేరకు వార్త రాసిన ట్రైబ్యూన్ రిపోర్టర్ రచనా ఖైరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రిపోర్టర్పై ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రచనా ఖైరాతోపాటు మరి కొందరు జర్నలిస్ట్లపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 410, 420, 468, 471 కింద కేసు నమోదు చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రజా ప్రయోజనాలు దాగున్న ఓ కథనంపై ఇలా స్పందించడం సరికాదని, ఇది దుర్మార్గపు చర్యని, పత్రికా స్వేచ్ఛకు విఘాతమని ఎడిటర్స్ గిల్డ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపట్టకుండా, రిపోర్టర్లపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. మరోవైపు అక్రమాలపై విచారణ చేపట్టకుండా.. వాటిని వెలికి తీసిన వారిని శిక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
సంచలన కథనం రాసిన 'ది ట్రిబ్యూన్' రిపోర్టర్ రచనా ఖైరాను ఆ పత్రిక ఎడిటర్ హరీష్ ఖారే సైతం అభినందించారు. ఇప్పుడు బయటకు వచ్చింది పెద్ద మంచుకొండలోని చిన్న ముక్కేనని, మరెంతో బయటకు రానుందని ఆయన తెలిపారు. ఆధార్ కార్డులపై తప్పుడు ఆరోపణలతో వార్తలు రాశారని రచనా ఖైరాపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ పరిశోధనకు ఫలితంగా ఎఫ్ఐఆర్ రూపంలో ప్రోత్సాహం లభించిందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఖైరా మాట్లాడుతూ, "నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. మా విచారణ మొత్తం పూర్తయింది. ఈ తరహా పరిశోధనలో ఉన్న సున్నితత్వాన్ని యూఐడీఏఐ అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకూ మేము వెలుగులోకి తెచ్చిన వివరాలతో పోలిస్తే ఇంకా చాలా సమాచారం మా దగ్గర ఉంది. అతి త్వరలోనే అది కూడా వెల్లడవుతుంది" అన్నారు. తన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ రిపోర్టరుకు అవసరమైన అన్ని రకాల న్యాయ సహాయాన్ని అందిస్తానని ఖారే వెల్లడించారు.
ప్రజా ప్రయోజనాలు దాగున్న ఓ కథనంపై ఇలా స్పందించడం సరికాదని, ఇది దుర్మార్గపు చర్యని, పత్రికా స్వేచ్ఛకు విఘాతమని ఎడిటర్స్ గిల్డ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపట్టకుండా, రిపోర్టర్లపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. మరోవైపు అక్రమాలపై విచారణ చేపట్టకుండా.. వాటిని వెలికి తీసిన వారిని శిక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
సంచలన కథనం రాసిన 'ది ట్రిబ్యూన్' రిపోర్టర్ రచనా ఖైరాను ఆ పత్రిక ఎడిటర్ హరీష్ ఖారే సైతం అభినందించారు. ఇప్పుడు బయటకు వచ్చింది పెద్ద మంచుకొండలోని చిన్న ముక్కేనని, మరెంతో బయటకు రానుందని ఆయన తెలిపారు. ఆధార్ కార్డులపై తప్పుడు ఆరోపణలతో వార్తలు రాశారని రచనా ఖైరాపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ పరిశోధనకు ఫలితంగా ఎఫ్ఐఆర్ రూపంలో ప్రోత్సాహం లభించిందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఖైరా మాట్లాడుతూ, "నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. మా విచారణ మొత్తం పూర్తయింది. ఈ తరహా పరిశోధనలో ఉన్న సున్నితత్వాన్ని యూఐడీఏఐ అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకూ మేము వెలుగులోకి తెచ్చిన వివరాలతో పోలిస్తే ఇంకా చాలా సమాచారం మా దగ్గర ఉంది. అతి త్వరలోనే అది కూడా వెల్లడవుతుంది" అన్నారు. తన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ రిపోర్టరుకు అవసరమైన అన్ని రకాల న్యాయ సహాయాన్ని అందిస్తానని ఖారే వెల్లడించారు.