యాప్నగరం

ఐటీ చెల్లింపులకు ఆధార్ తప్పనిసరి: కేంద్రం

ఆదాయ పన్ను (ఇన్ కమ్ ట్యాక్స్) చెల్లింపులకు ఆధార్ సంఖ్య తప్పనిసరని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.

TNN 22 Mar 2017, 8:28 pm
ఆదాయ పన్ను (ఇన్ కమ్ ట్యాక్స్) చెల్లింపులకు ఆధార్ సంఖ్య తప్పనిసరని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. పాన్ సంఖ్య కోసం ధరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందేనని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు.
Samayam Telugu aadhaar must for i t returns to curb tax evasion and frauds government
ఐటీ చెల్లింపులకు ఆధార్ తప్పనిసరి: కేంద్రం


‘‘ఆధార్ సంఖ్య బయోమెట్రిక్ విధానంలో రూపొందించబడింది. అందువల్ల దీని ద్వారా అవకతవకలకు అవకాశం లేదు. పన్ను ఎగవేతలకు అరికట్టేందుకు ఆధార్ ను తప్పనసరి చేస్తున్నాం’’ అని జైట్లీ తెలిపారు.

దేశంలో 98శాతం (108కోట్ల ప్రజలు) వయోజనులు ఆధార్ సంఖ్యను కల్గి ఉన్నారని చెప్పి జైట్లీ..చాలా మంది వద్ద ఒకటికి మించిన పాన్ కార్డులున్నాయని...గుర్తు చేశారు.

అయితే ఆధార్ కార్డులను అన్నింటికి తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బీజేడీ సభ్యులు భర్తృహరి మెహతబ్ జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగంలో ముందున్న భారత్...ఆధార్ సంఖ్యను ఐటీ రిటర్న్స్ కు అనుసంధానం చేస్తే పన్ను ఎగవేతలు ఉండవని..అందుకే తప్పనిసరి అని వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, వ్యవసాయాధారిత ఆదాయంపై పన్ను విధించడం లేదని జైట్లీ పేర్కొన్నారు. వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై పన్ను విధించడం ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశం అని ఆయన తెలిపారు.

డిజిటల్ చెల్లింపులను ప్రొత్సహించేందుకు నగదు లావాదేవీలకు రూ.2లక్షలకు కుదించామని, ఇంతకు ముందు చెప్పిన రూ.3లక్షల పరిమితిని తగ్గిస్తూ సవరణ చేపడ్తామని జైట్లీ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.