ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు చెందిన లోక్సభ స్థానంలో ఆమ్ ఆద్మీ ఓడిపోయింది. అధికార పార్టీ అభ్యర్థిపై శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమ్రంజిత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి గుల్మైర్పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంగ్రూర్ నుంచి వరసగా 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ ఎంపీగా గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందండంతో.. సీఎంగా భగవంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన సీటుకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇలా ఓటమి పాలవడం ఆప్కు పెద్ద షాక్ అనే చెప్పాలి.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా, దిర్బా, బర్నాలా, సునమ్, బదౌర్, మెహల్ కలాన్, మలేర్కోట్ల, ధురి, సంగ్రూర్ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మంట్లను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. భగవంత్ మాన్ 2014 లోక్సభ ఎన్నికలలో SAD అభ్యర్థి సుఖ్దేవ్ సింగ్ ధిండాను 2.11 లక్షల ఓట్ల తేడాతో ఓడించి సంగ్రూర్ స్థానాన్ని గెలుచుకున్నారు.
అందులో ఈ ఉప ఎన్నికలను ఆమ్ఆద్మీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ, ఎస్ఎడీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలనుకున్నాయి. ఈ మేరకు సంగ్రూర్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న సింగ్ (38)ను ఆప్ రంగంలోకి దించగా.. బర్నాలా మాజీ ఎమ్మెల్యే ధిల్లాన్ను బీజేపీ రంగంలోకి దించింది.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా, దిర్బా, బర్నాలా, సునమ్, బదౌర్, మెహల్ కలాన్, మలేర్కోట్ల, ధురి, సంగ్రూర్ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మంట్లను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. భగవంత్ మాన్ 2014 లోక్సభ ఎన్నికలలో SAD అభ్యర్థి సుఖ్దేవ్ సింగ్ ధిండాను 2.11 లక్షల ఓట్ల తేడాతో ఓడించి సంగ్రూర్ స్థానాన్ని గెలుచుకున్నారు.
అందులో ఈ ఉప ఎన్నికలను ఆమ్ఆద్మీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ, ఎస్ఎడీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలనుకున్నాయి. ఈ మేరకు సంగ్రూర్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న సింగ్ (38)ను ఆప్ రంగంలోకి దించగా.. బర్నాలా మాజీ ఎమ్మెల్యే ధిల్లాన్ను బీజేపీ రంగంలోకి దించింది.