యాప్నగరం

ప్రధాని నివాసం వద్దకు వెళ్లకుండానే ఆగిన ఆప్ నిరసన ర్యాలీ

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చింది.

Samayam Telugu 17 Jun 2018, 8:32 pm
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చింది. వారం రోజులపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో మంత్రులతో కలసి ధర్నా చేసిన కేజ్రీవాల్.. ఆదివారం ర్యాలీకి పిలుపునిచ్చారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నివాసం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీగా బయలుదేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు గవర్నర్ నివాసం వద్దకు చేరుకున్నారు. వీరికి సీపీఐ(ఎం) కార్యకర్తలు తోడయ్యారు.
Samayam Telugu Delhi

కేజ్రీవాల్ నిరసన మార్చ్‌కు మద్దుతుగా సీపీఐ(ఎం) కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనాలని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. భారీ జనసందోహం మధ్య ఆదివారం సాయంత్రం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నివాసం నుంచి కేజ్రీవాల్ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. అయితే ఈ ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసుల నుంచి అనుమతి కోరలేదు. దీంతో పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆప్ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
నిరసన ర్యాలీ చేయడానికి వారికి అనుమతి లేదని, అందుకే వారిని పార్లమెంట్ స్ట్రీట్‌లో అడ్డుకున్నామని న్యూ ఢిల్లీ డీసీపీ చెప్పారు. ఇక ఇక్కడి నుంచి ముందుకెళ్లే ప్రసక్తిలేదని వారికి చెప్పామని కూడా వెల్లడించారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటుచేశామని, వారు ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడం అసాధ్యమని చెప్పారు. ఆప్ అభ్యర్థులు, కార్యకర్తలు తమ మాట వింటారనే నమ్మకం తమకుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.