యాప్నగరం

మీరాకుమార్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు!

రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యం కావడంతో గెలుపు కోసం అధికార, విపక్షాలు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.

Samayam Telugu 23 Jun 2017, 4:12 pm
రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యం కావడంతో గెలుపు కోసం అధికార, విపక్షాలు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. 17 పార్టీల మద్దతుతో లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల పోరులో బరిలో నిలిచారు. దళిత మహిళా నేతకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ వంటి పార్టీలు ఎన్డీయేతర పార్టీలను కోరుతున్నాయి.
Samayam Telugu aap to support meira kumar in president election
మీరాకుమార్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు!


బిహార్ గవర్నర్ గా పనిచేసినందుకు తాము కోవింద్ కే మద్దతు ఇస్తామని బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించగా... బిహార్ కే చెందిన నాయకురాలు మీరాకుమార్ ను రంగంలోకి దించి ప్రతిపక్షాలు ఆయన్ను ఇరుకున పడేశాయి. మనసు మార్చుకొని మీరాకుమార్ కు ఓటేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఇతర నేతలు నితీష్ ను కోరుతున్నారు. నితీష్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకొని మీరాకు జై కొట్టారు.

కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ మీరాకుమార్ మద్దతు ప్రకటించున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ జైకొట్టేది లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆప్ పార్టీకి నలుగురు ఎంపీలు, 89 మంది ఎమ్మెల్యే బలం ఉంది.

ప్రస్తుతం ఎన్డీయే అభ్యర్థి కోవింద్ కు ఎలక్టోరల్ కాలేజీలో 63శాతం ఓట్లతో సేఫ్ సైడ్ లో ఉండగా.. చివర్లో ఏదైనా జరిగి గట్టిపోటీనిచ్చి మీరాకుమార్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని ఆమె మద్దతుదారులు ధీమాతో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.