యాప్నగరం

నకిలీ రూ.2వేల నోట్లు తరలిస్తూ బుక్కయిన అవార్జు గ్రహీత

ప్రత్యేక అవార్డ్ అందుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసలు పొందిన అభినవ్ వర్మ (21) నకిలీ రూ.2వేల నోట్లను ముద్రిస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు.

TNN 3 Dec 2016, 2:32 pm
ప్రదానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డ్ అందుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసలు పొందిన అభినవ్ వర్మ (21) అనే యువకుడు నకిలీ రూ.2వేల నోట్లను ముద్రిస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు. పంజాబ్ కు చెందిన 21 సంవత్సరాల అభినవ్ వర్మ రూ.45 లక్షల దొంగ నోట్లను తరలిస్తుండగా పంజాబ్ పోలీసులు కాపుగాసి పట్టుకున్నారు. దేశంలో నోట్ల రద్దు తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కొరతను అవకాశంగా తీసుకున్న అభినవ్ వర్మ రాత్రికి రాత్రి లక్షాధికారి కావాలనుకుని పన్నాగం పన్నాడు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాల్సిన తన మేధస్సును అడ్డదారిలో ఉపయోగించి దొంగనోట్ల ముద్రణకు పూనుకున్నాడు. రూ.500, రూ.1000 నోట్లను 30శాతం కమిషనుకు మార్చి ఇస్తానని తీసుకుని దొంగనోట్లను వారికి అంటగడుతున్నాడు.
Samayam Telugu abhinav varma booked for fake currency
నకిలీ రూ.2వేల నోట్లు తరలిస్తూ బుక్కయిన అవార్జు గ్రహీత


ఈ రాకెట్లో అభినవ్ తో పాటు అతని సోదరుడు మరికొందరు వ్యక్తులు భాగస్వాములు. వారు పెద్ద ఎత్తున నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్టుతో సంబంధం ఉన్న మిగిలిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ప్రధాని మేకిన్ ఇండియాలో పాల్గొన్న అభినవ్ తాను రూపొందించి న పరికరంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని చేతుల మీదుగా అవార్డు సైతం అందుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.