యాప్నగరం

లెక్కకుమించిన డిపాజిట్లపై విచారణ : ఇన్‌కమ్ టాక్స్ విభాగం

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆదాయంకుమించి అధికమొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఎకౌంట్లపై విచారణ...

TNN 17 Nov 2016, 6:26 am
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆదాయంకుమించి రూ.2.50 లక్షలకన్నా అధికమొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఎకౌంట్లపై విచారణ జరిపిస్తాం అంటున్నారు ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారులు. అంతేకాకుండా అలా డిపాజిట్ అయిన నగదుపై 200శాతం జరిమానా కూడా విధిస్తాం అని మరోసారి తేల్చిచెప్పారు. రూ.2.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఎకౌంట్ల వివరాలతోపాటు.. ఒక ఎకౌంట్‌లో ఒకే రోజున రూ. 50 లక్షల నగదు డిపాజిట్ అయిన ఎకౌంట్ల వివరాల్ని తమకి అందజేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( సీబీడీటీ ) ఇప్పటికే అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
Samayam Telugu abnormal rise in deposits will be under scan tax authorities
లెక్కకుమించిన డిపాజిట్లపై విచారణ : ఇన్‌కమ్ టాక్స్ విభాగం


కరెంట్ ఎకౌంట్స్‌లో డిపాజిట్ల విషయానికొస్తే, ఒకే వ్యక్తికి చెందిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కరెంట్ ఎకౌంట్లలో డిపాజిట్ అయిన మొత్తం రూ.12.50 లక్షలు దాటినట్టయితే, ఆయా ఎకౌంట్ల వివరాల్ని బ్యాంకులు సీబీడీటీకి అందజేయాల్సి వుంటుంది. ''అలా తమ వద్దకొచ్చిన ఎకౌంట్ల వివరాలని వారు ఫైల్ చేసిన టాక్స్ రిటర్న్స్‌తో సరిపోల్చిచూడటం జరుగుతుంది. ఈ క్రమంలో సంబంధిత ఎకౌంట్ హోల్డర్ ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ కన్నా లెక్కకుమించి వచ్చిన ఆదాయంకు సంబంధించిన గణాంకాలు చూపించుకోవాల్సి వుంటుంది. ఆదాయంకు సంబంధించిన ఆధారాలు చూపించుకోలేని వారు టాక్స్‌తోపాటు 200% జరిమానా సైతం చెల్లించాల్సి వుంటుంది'' అని సంబంధిత అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.