యాప్నగరం

బాణసంచా పరిశ్రమలో ఘోర ప్రమాదం

బాణాసంచా తయారు చేసే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి 23 మంది సజీవదహనం అయ్యారు.

TNN 8 Jun 2017, 9:18 am
మధ్యప్రదేశ్ లో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారు చేసే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి 23 మంది సజీవదహనం అయ్యారు. మరో 10 మంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బాలాఘాట్ లో ఉన్న బాణాసంచా కర్మాగారంలో బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని నాగ్ పూర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్పకూలి పోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రం అయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
Samayam Telugu accident in firecracker factory 23 charred to dead in madhyapradesh
బాణసంచా పరిశ్రమలో ఘోర ప్రమాదం


శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు సహాయక సిబ్బంది. ఇంతలా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలేంటీ అన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. అక్కడ పనిచేసే వారిలో ఒకరు తాగి పడేసి బీడీ వల్లే బాణాసంచా అంటుకుందని భావిస్తున్నారు. గాయపడిన వారికి అయ్యే ఆసుపత్రి ఖర్చులు భరించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.