రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో రోజు పాటు జోధ్పూర్ సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వుల జారీకి రేపటి వరకు సమయం పట్టనుండటంతో శుక్రవారం రాత్రి కూడా సల్మాన్ జైలులోనే ఉండాల్సి వస్తుంది. 1998లో రెండు కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ను గురువారం జోధ్పూర్ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయమూర్తి ఆయనకు ఐదేళ్ల శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధించారు.
సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే సల్మాన్ న్యాయవాది హెచ్ఎం సరస్వత్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుందని, సల్మాన్కు బెయిల్ మంజూరవుతుందని అంతా భావించారు. అయితే ఆ బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులు జారీలో జాప్యం చోటుచేసుకుంది. దీంతో గురువారం రాత్రి జోధ్పూర్ సెంట్రల్ జైలులో గడిపిన సల్మాన్.. ఈ రోజు రాత్రి కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది. మరోవైపు సెషన్స్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కూడా పిటిషన్ దాఖలు చేస్తామని సల్మాన్ లాయర్ సరస్వత్ వెల్లడించారు.
కాగా, 20 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు వంటి స్టార్లు నిందితులుగా ఉండటం, బిష్ణోయ్ తెగ అలుపెరగని పోరాటం చేయడంతో అందరి దృష్టి ఈ కేసుపై పడింది. మొత్తానికి సల్మాన్ను దోషిగా తేల్చిన జోధ్పూర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి.. మిగిలిన నలుగురుని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు.
సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే సల్మాన్ న్యాయవాది హెచ్ఎం సరస్వత్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుందని, సల్మాన్కు బెయిల్ మంజూరవుతుందని అంతా భావించారు. అయితే ఆ బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులు జారీలో జాప్యం చోటుచేసుకుంది. దీంతో గురువారం రాత్రి జోధ్పూర్ సెంట్రల్ జైలులో గడిపిన సల్మాన్.. ఈ రోజు రాత్రి కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది. మరోవైపు సెషన్స్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కూడా పిటిషన్ దాఖలు చేస్తామని సల్మాన్ లాయర్ సరస్వత్ వెల్లడించారు.
కాగా, 20 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు వంటి స్టార్లు నిందితులుగా ఉండటం, బిష్ణోయ్ తెగ అలుపెరగని పోరాటం చేయడంతో అందరి దృష్టి ఈ కేసుపై పడింది. మొత్తానికి సల్మాన్ను దోషిగా తేల్చిన జోధ్పూర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి.. మిగిలిన నలుగురుని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు.