యాప్నగరం

యూపీలో వీఐపీల భద్రతపై యోగి సంచలన నిర్ణయం!

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలతో అటు అధికారులను, మంత్రి వర్గాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

TNN 23 Apr 2017, 10:04 am
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలతో అటు అధికారులను, మంత్రి వర్గాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా యోగి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్‌, అఖిలేష్ యాదవ్‌, మాయావతితోపాటు అఖిలేశ్ భార్య డింపుల్‌ యాదవ్‌, బాబాయ్ శివపాల్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌‌, అజంఖాన్ భద్రతను జెడ్ ప్లస్ కెటగిరీ నుంచి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బీజేపీ సీనియర్‌ నేత వినయ్ కతియార్‌తోపాటు మరి కొందరికి భద్రతను పెంచారు. వినయ్ కతియార్‌కు జెడ్‌ కేటగిరి భద్రత కల్పిస్తూ శనివారం రాత్రి హోం శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు రాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
Samayam Telugu adityanaths up govt downgrades security of mulayam family and mayawati
యూపీలో వీఐపీల భద్రతపై యోగి సంచలన నిర్ణయం!


ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 151 మంది వీఐపీలు భద్రతలో కొంత మందికి కుదిస్తే, మరి కొందరికి పూర్తిగా ఉద్వాసన పలికారు. వీరిలో 46 మంది వీఐపీలకు భద్రత తగ్గించగా, మిగతా 100 మందికిపైగా పూర్తి భద్రతను ఉపసంహరించారు. వీరిలో బీఎస్పీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా, యూపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్, ఎస్పీ ఎమ్మెల్సీలు అశు మాలిక్, అతుల్ ప్రధాన్‌ తదితరులు ఉన్నారు. భద్రతను హోదాగా భావిస్తున్నారని, సిబ్బందిని సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాలని ఇటీవల యోగి పేర్కొన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.