యాప్నగరం

పెళ్లి కావడం లేదని పక్కింటి అమ్మాయిని చంపాడు

ఓ వెరైటీ మర్డర్ కేసు ఇప్పుడు ఆసక్తకరంగా మారింది. ఓ యువకుడు పెళ్లి కావడంలేదనే కోపంతో పక్కింటి అమ్మాయిని చంపేశాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది.

Samayam Telugu 3 Apr 2018, 12:24 pm
ఓ వెరైటీ మర్డర్ కేసు ఇప్పుడు ఆసక్తకరంగా మారింది. ఓ యువకుడు పెళ్లి కావడంలేదనే కోపంతో పక్కింటి అమ్మాయిని చంపేశాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన పింటు అనే యువకుడు కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు వెతుకుతున్నాడు. ఎంతమంది అమ్మాయిల్ని చూసినా లాభం లేకుండాపోయింది. అలాగే 12సార్లు పెళ్లి చూపులకు కూడా వెళ్లి వచ్చాడు. అందరూ అతడ్ని తిరస్కరించారు. ఎన్ని రోజులైనా పెళ్లి కుదరకపోవంతో... పింటులో కోపం పెరిగిపోయింది.
Samayam Telugu Murder


తనకు పెళ్లి కాకపోవడానికి పక్కింట్లో ఉండే యువతే కారణమని అనుమానం పెంచుకున్నాడు పింటు. ఆమె తనకు వివాహం కాకుండా చేతబడి చేస్తోందనుకున్నాడు. యువతిపై కక్ష పెంచుకొని... ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లాడు. చున్నీ తీసుకొని గొంతు నులిమేశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు... అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పింటుకు సరిగ్గా చదువు కూడా పూర్తి కాలేదు. అతడు డిగ్రీ సెకండియర్ చదవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్థం పర్థం లేని పిచ్చి ఆలోచనతో ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. తన భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాడు పింటు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.