యాప్నగరం

Defamation Case: ప్రభుత్వ బంగ్లాను ఖాళీచేసిన రాహుల్ గాంధీ.. లగేజీతో ఎక్కడకు వెళ్లారంటే?

Defamation Case మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గత నెలలో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేయాలన్ని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అనర్హత వేటు పడటం వల్ల ఎంపీ సభ్యత్వం కోల్పోయారు. తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునే వరకు సమయం ఇవ్వాలని కోరారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 Apr 2023, 9:48 pm

ప్రధానాంశాలు:

  • మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలతో పరువునష్టం కేసు
  • రెండేళ్ల జైలు శిక్ష ఖరారుచేసిన సూరత్ న్యాయస్థానం
  • అనర్హుడు కావడంతో బంగ్లా ఖాళీచేయాలని నోటీసు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ప‌రువున‌ష్టం కేసులో (Defamation Case) దోషిగా నిర్దారణ అయి రెండేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ఢిల్లీలో త‌న అధికార నివాసాన్ని (Govt Bungalow) శనివారం ఖాళీ చేశారు. ఈ బంగ్లాలో రాహుల్ గాంధీ 2005 ఏప్రిల్ 22 నుంచి నివాసం ఉంటున్నారు. సరిగ్గా అదే ఏప్రిల్ 22న ఆయన ప్రభుత్వ భవానాన్ని యాదృశ్చికంగా ఖాళీచేయడం గమనార్హం. వాయినాడ్ ఎంపీని అనర్హుడిగా ప్రకటించడంతో ప్ర‌భుత్వ భ‌వ‌నంలో ఉండ‌డానికి అన‌ర్హులు. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన త‌ర్వాత నెల రోజులు నోటీస్ పీరియ‌డ్ ఇచ్చారు. అయితే, అనివార్య ప‌రిస్థితుల్లో రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ చేయాల్సి వ‌స్తోంది.
బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌స‌భ హౌజింగ్ క‌మిటీ .. బంగ్లాను ఖాళీ చేయాల‌ని రాహుల్‌కు నోటీసు జారీచేసింది. దీంతో 12 తుగ్ల‌క్ లేన్ బంగ్లాను రాహుల్ వదిలి పెట్టి.. 10న జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి మారుతున్నారు. ప్రోటోకాల్ ప్ర‌కారం రాహుల్ త‌న నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినా.. కేంద్రం రాజ‌కీయ క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

వాస్తవానికి ప‌రువున‌ష్టం కేసులో తిరిగి అప్పీల్‌కు గుజరాత్ కోర్టు 30 రోజుల గ‌డువు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పుపై రాహుల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయినా, అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్వత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సూర‌త్ సెష‌న్స్ కోర్టు తీర్పు గాంధీ కుటుంబానికి చెంప‌పెట్టు అని బీజేపీ ఆరోపించింది. సూర‌త్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ గుజ‌రాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.