మరో ఎంపీ రచ్చ: ఆలస్యమైన ఎయిరిండియా
ఎయిరిండియా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వివాదం సద్దుమణిగి గంటలు గడవకముందే..
TNN 7 Apr 2017, 7:11 pm
ఎయిరిండియా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వివాదం సద్దుమణిగి గంటలు గడవకముందే.. మరో ఎంపీ రచ్చ సంచలనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఎయిరిండియా విమానంలో హంగామా సృష్టించారు. వీల్ చైర్ కు పరిమితమైన తన తల్లికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆమె విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నాం 2.25 గంటలకు డోలా సేన ఢిల్లీ నుంచి కోల్ కతాకు ఎయిరిండియా విమానంలో వెళ్లేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్నారు. తనతో పాటు తన తల్లికి కూడా టికెట్ బుక్ చేశారు.
వీల్ చైర్ లో ఉన్న తన తల్లికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఎంపీ విమాన సిబ్బందికి సూచించారు. అయితే ఎంపీ తన తల్లి వీల్ చైర్ లో ఉన్నారని తకు చెప్పలేదని, టికెట్ బుకింగ్ సమయంలో వివరాలు పేర్కొనలేదని విమాన సిబ్బంది వివరించింది. సిబ్బందికి ఎంపీకి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విమానం 39 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది.
అయితే వరుసగా ఎయిరిండియాపై ఎంపీలు విరుచుకుపడటం సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నాం 2.25 గంటలకు డోలా సేన ఢిల్లీ నుంచి కోల్ కతాకు ఎయిరిండియా విమానంలో వెళ్లేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్నారు. తనతో పాటు తన తల్లికి కూడా టికెట్ బుక్ చేశారు.
వీల్ చైర్ లో ఉన్న తన తల్లికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఎంపీ విమాన సిబ్బందికి సూచించారు. అయితే ఎంపీ తన తల్లి వీల్ చైర్ లో ఉన్నారని తకు చెప్పలేదని, టికెట్ బుకింగ్ సమయంలో వివరాలు పేర్కొనలేదని విమాన సిబ్బంది వివరించింది. సిబ్బందికి ఎంపీకి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విమానం 39 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది.
అయితే వరుసగా ఎయిరిండియాపై ఎంపీలు విరుచుకుపడటం సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తోంది.