యాప్నగరం

తమిళనాడులో అమ్మ జయంతి వేడుకలు

తమిళనాడులో దివంగత సీఎం అమ్మ జయలలిత 69వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Samayam Telugu 24 Feb 2017, 2:54 pm
తమిళనాడులో దివంగత సీఎం అమ్మ జయలలిత 69వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జయ జయంతి సందర్భంగా గురువారం పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. ‘‘ అక్క (జయ) పుట్టిన రోజు వేడుకల్ని 33 ఏళ్లపాటు ఆమెతో ఉన్నాను. ఇప్పుడు అమ్మ లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది’’ అని లేఖలో శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu after jayalalithaa amma birth anniversary celebrations across tn
తమిళనాడులో అమ్మ జయంతి వేడుకలు


శుక్రవారం ముఖ్యమంత్రి పళనిసామి జయలలిత జయంతి సందర్భంగా పలు కార్రక్రమాలు చేపట్టారు. ఆమె 69వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 69లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ కార్యాలయంలో అమ్మ చిత్రపటానికి నమస్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర నేతలు పాల్గొన్నారు.

అమ్మ మరణం తర్వాత పార్టీలో చీలిక ఏర్పడంతో..శశికళను విభేదించి వేరుకుంపటి పెట్టుకున్న మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆర్కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పేద ప్రజలను పంచిపెట్టేందుకు పలు ఉపకరణాలు, ఇతర వస్తువులు సిద్ధం చేశారు.

అటు జయ మేనకోడలు దీపా జయకుమార్ అమ్మ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఒక అనాథ ఆశ్రమానికి వెళ్లి పిల్లలకు అల్ఫారం పెట్టించారు.

వీరితో ఇతర నేతలు, మంత్రులు తమతమ రాష్ట్రవ్యాప్తంగా జయలలిత జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టి అమ్మ ఆశయాలు కొనసాగిస్తామని ప్రతినబూనారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.