యాప్నగరం

ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన రైతు సంఘాల నేతలు

PM Modi: చర్చలకు ప్రభుత్వం సిద్దమంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలపునకు రైతు సంఘాల నేతలు స్పందించారు. చర్చలకు సిద్ధమని, తేదీ నిర్ణయించాలని తెలిపారు.

Samayam Telugu 8 Feb 2021, 11:35 pm
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు రైతు సంఘాల నేతలు స్పందించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. సమావేశాలకు తేదీ నిర్ణయించాలని అన్నారు. రాజ్యసభలో సోమవారం (ఫిబ్రవరి 8) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ.. రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆందోళన విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి.
Samayam Telugu రైతులు
farm laws


‘ప్రభుత్వంతో చర్చలను మేం ఎప్పుడూ తిరస్కరించలేదు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేం వెళ్లి సంప్రదింపులు జరిపాం. ఇప్పుడు కూడా చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. తదుపరి భేటీకి తేదీ, సమయం ప్రభుత్వమే నిర్ణయించాలి’ అని సంయుక్త కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యులు, రైతు నేత శివకుమార్‌ కక్కా మీడియాతో అన్నారు.

కేంద్రంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని.. అయితే, ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానం రావాలని మరో నాయకుడు అభిమన్యు కోహర్‌ అన్నారు. ‘కనీస మద్దతు ధరలో మార్పుండదని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు దానిపై చట్టబద్ధమైన హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది?’ అని ఆయన ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.