ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ మాత్రమే అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశమని, చైనా కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ రెండు రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. చైనా స్వార్థబుద్ధితో మాత్రమే అమెరికాతో స్నేహం చేస్తుందని ఆయన ఆరోపించారు. బాధ్యత గల భారత్ లాంటి దేశాలతో వ్యాపార సంబంధాలను కూడా మెరుగుపరుచుకుంటే రెండు దేశాలకు మేలు జరుగుతుందని టిల్లర్సన్ అభిప్రాయపడ్డారు. దీనిపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ప్రసంగించిన టిల్లర్సన్ భారత్-అమెరికా సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని, భవిష్యత్తులో ఇరుదేశాలను మరింత దగ్గర చేస్తాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే వారం టిల్లర్సన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా మోడీ-ట్రంప్ భేటీని కూడా టిల్లర్సన్ ప్రస్తావించారు. అమెరికాలో భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించిందని, ట్రంప్ మరే దేశాధినేతకు ఇవ్వని గౌరవాన్ని మోడీ పట్ల చూపారని టిల్లర్సన్ గుర్తుచేశారు. చైనా దక్షిణ సముద్రంలో అమెరికా సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని టిల్లర్సన్ విమర్శలు గుప్పించారు. చైనాతో సంబంధాలకు ఇది ప్రధాన అవరోధంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పాకిస్థాన్ తీవ్రవాదాన్నే తన విధానంగా మలచుకుందని విమర్శించారు. పాకిస్థాన్ ఇటు భారత్తో కూడా చైనాకు మంచి సంబంధాలు లేవని ఇటీవల డోక్లామ్ వివాదంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగిందన్నారు.
ఈ సందర్భంగా మోడీ-ట్రంప్ భేటీని కూడా టిల్లర్సన్ ప్రస్తావించారు. అమెరికాలో భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించిందని, ట్రంప్ మరే దేశాధినేతకు ఇవ్వని గౌరవాన్ని మోడీ పట్ల చూపారని టిల్లర్సన్ గుర్తుచేశారు. చైనా దక్షిణ సముద్రంలో అమెరికా సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని టిల్లర్సన్ విమర్శలు గుప్పించారు. చైనాతో సంబంధాలకు ఇది ప్రధాన అవరోధంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పాకిస్థాన్ తీవ్రవాదాన్నే తన విధానంగా మలచుకుందని విమర్శించారు. పాకిస్థాన్ ఇటు భారత్తో కూడా చైనాకు మంచి సంబంధాలు లేవని ఇటీవల డోక్లామ్ వివాదంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగిందన్నారు.