యాప్నగరం

వేధింపులపై యూపీ నేత వివాదాస్పద వ్యాఖ్య

ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు మహిళలపై పోకిరి గ్యాంగ్ వేధింపులు, అత్యాచారయత్నం సంచలనం రేపింది.

Samayam Telugu 28 May 2017, 4:35 pm
ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు మహిళలపై పోకిరి గ్యాంగ్ వేధింపులు, అత్యాచారయత్నం సంచలనం రేపింది. 14 మంది యువకులు దారెంట వెళ్తున్న ఇద్దరు మహిళలను వెంబడించి ఆటపట్టించారు. వద్దని వారిస్తున్నా, వేడుకుంటున్నా.. వారిని లాగడం.. తాకరాని చోట తాకడం.. ఎత్తుకుపోవడం వంటి ప్రయత్నాలు చేశారు యువకులు. ఒకవైపు ఇలా చేస్తే మరోవైపు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
Samayam Telugu after women groped up ex minister shocking advice to women
వేధింపులపై యూపీ నేత వివాదాస్పద వ్యాఖ్య


మహిళలను వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇద్దరు ఆకతాయిలను అరెస్టు చేశారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందో ఇంకా తెలియరాలేదు.

ఈ సంఘటనపై యూపీ మాజీ మంత్రి, ఎస్పీ నేత అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అందులో (మహిళలపై వేధింపులు) ఆశ్యర్యపోవాల్సిన అవసరం ఏముంది? యోగి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. అయితే మహిళలు అలాంటి ప్రాంతాల్లో (వేధింపులు జరిగే) తిరగకూడదు’ అని అజాంఖాన్ సలహా ఇచ్చారు.

అయితే ఒకవైపు యాంటీ రోమియో స్క్వాడ్ ల ఏర్పాటుతో మహిళలపై వేధింపులను అరికడతామని ప్రభుత్వం చెబుతూనే ఉన్నా.. ఇలాంటి సంఘటనలు జరగడం.. మరోవైపు నేతలు.. మహిళలు బయట తిరగవద్దని సలహాలు ఇవ్వడం ఏంటనీ మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.