అన్నాడీఎంకే నేత జయలలిత మృతి తరువాత తమిళనాట రాజకీయాలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. అమ్మ మరణం తర్వాత సీఎంగా అమ్మకు వీరవిధేయుడు పన్నీర్సెల్వంను నియమించారు. అయితే రెండు నెలల వ్యవధిలోనే అయనను తొలగించి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని జయ నెచ్చెలి శశికళ భావించారు. అయితే పన్నీర్ ఎదురుతిరిగి తిరుగుబావుటా ఎగురవేయడంతో చిన్నమ్మ ఖంగుతున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆమెను దోషిగా పేర్కొంది. దీంతో తన అనుచరుడైన పళనిసామికి కుర్చీ కట్టబెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. పళని, పన్నీర్ వర్గాలుగా చీలిపోయిన అన్నాడీఎంకే మళ్లీ సోమవారం ఒక్కటైంది.
సీఎం పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరు వర్గాల విలీనంపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబయి నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. పళనిసామి మంత్రివర్గంలో పన్నీర్తోపాటు అతడి అనుచరులు కొంతమందికి చోటుదక్కనుంది. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ మార్గదర్శక కమిటీకి కూడా పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వహించనున్నారు. గత కొద్ది రోజులుగా విలీనంపై ఇరు వర్గాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
ఈ రోజు ఉదయమే విలీనం ఉంటుందని ప్రకటించినా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే కార్యాలయానికి పన్నీర్ వర్గం బయలుదేరితే, పళనిసామి మొహం చాటేశారు. దీంతో పన్నీర్ ఆగిపోయారు. ఆ తర్వాత పళనిసామి ఏఐఏడీఎంకే కార్యాలయానికి చేరుకుంటే పన్నీర్ మాత్రం రాలేదు. దీంతో మారోసారి అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పన్నీర్సెల్వం 10 షరతులకు పళని అంగీకరించడంతో విలీన ప్రక్రియ పూర్తయింది. వీలీనంతో శశికళకు ఊహించని షాక్ తగిలింది.
సీఎం పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరు వర్గాల విలీనంపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబయి నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. పళనిసామి మంత్రివర్గంలో పన్నీర్తోపాటు అతడి అనుచరులు కొంతమందికి చోటుదక్కనుంది. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ మార్గదర్శక కమిటీకి కూడా పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వహించనున్నారు. గత కొద్ది రోజులుగా విలీనంపై ఇరు వర్గాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
ఈ రోజు ఉదయమే విలీనం ఉంటుందని ప్రకటించినా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే కార్యాలయానికి పన్నీర్ వర్గం బయలుదేరితే, పళనిసామి మొహం చాటేశారు. దీంతో పన్నీర్ ఆగిపోయారు. ఆ తర్వాత పళనిసామి ఏఐఏడీఎంకే కార్యాలయానికి చేరుకుంటే పన్నీర్ మాత్రం రాలేదు. దీంతో మారోసారి అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పన్నీర్సెల్వం 10 షరతులకు పళని అంగీకరించడంతో విలీన ప్రక్రియ పూర్తయింది. వీలీనంతో శశికళకు ఊహించని షాక్ తగిలింది.