యాప్నగరం

పళనిసామికి ఓటేసిన ఎమ్మెల్యేకు బెదిరింపులు

నిన్న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ముఖ్యమంత్రి పళనిసామికి అనుకూలంగా ఓటేసినందుకు...

TNN 19 Feb 2017, 6:30 pm
నిన్న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ముఖ్యమంత్రి పళనిసామికి అనుకూలంగా ఓటేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులు తనకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వాపోయారు ఏఐఏడీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన అమ్మన్ కే అర్జునన్ అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం తిరిగి ఇవాళే తన సొంత నియోజకవర్గానికి వచ్చారు.
Samayam Telugu aiadmk mla amman k arjunan has alleged he was receiving threat calls for supporting palanisamy
పళనిసామికి ఓటేసిన ఎమ్మెల్యేకు బెదిరింపులు


ఈ క్రమంలోనే పళనిసామికి ఎందుకు ఓటేశావు అని ఫోన్ చేస్తున్న కొంతమంది.. ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు అర్జునన్. తనకేకాకుండా తన భార్యకి కూడా ఫోన్ చేసి మరి బెదిరింపులకి పాల్పడుతున్నారని చెబుతున్న ఆయన త్వరలోనే ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జనం ముసుగులో వున్న డీఎంకే కార్యకర్తలు కొంతమంది తనని, తన తల్లిపై దూషణలకి దిగినట్టు మీడియాకు తెలిపారు అర్జునన్. కడుపుకు అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా అని ఫోన్ చేసి బెదిరిస్తున్న తీరుని చెప్పుకుని బాధపడ్డారాయన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.