యాప్నగరం

ఆ మహిళా ఎంపీకి మళ్లీ పెళ్లి

ఓ మహిళా ఎంపీ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరామె అనే కదా మీ డౌటు... అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప

Samayam Telugu 20 Mar 2018, 3:24 pm
ఓ మహిళా ఎంపీ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరామె అనే కదా మీ డౌటు... అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రిక కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 26న ఆమె ఢిల్లీలోని ఓ పెళ్లి చేసుకుంటుందట. వరుడెవరంటే... ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామస్వామి అట. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. సీఎం జయలలిత ఉన్నప్పుడు డీఎంకే ఎంపీ చెంప పగులగొట్టి వార్తల్లో నిలిచారు. తర్వాత పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. జయ మరణం తర్వాత ఆమె టీటీవీ దినకరన్ వర్గంలో కొనసాగుతున్నారు.
Samayam Telugu sasikala pushpa


శశికళ పుష్పకు లింగేశ్వర తిలకన్‌ అనే వ్యక్తితో గతంలోనే వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కాని ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు... వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. ఇప్పుడు ఆమె ఈమె రామస్వామిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పెళ్లికి 26న ఉదయం 9 గంటలకు ముహూర్తం కూడా కుదుర్చుకున్నారు. అదేరోజు ఉదయం 11 గంటలకు హోటల్‌లో గ్రాండ్‌ విందును కూడా ఏర్పాటు చేశారట. అప్పట్లో ఎంపీ చెంప పగులగొట్టి వార్తల్లో నిలిచిన పుష్ప... ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లితో హాట్‌టాపిక్ అయ్యారు.
Read This Story Also In Tamil

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.